కేతనకొండ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

0
562

 

కేతనకొండ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీటీసీ సభ్యులు కొమ్మూరు రామకోటేశ్వరావు

వార్తా లోకం మైలవరం : ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీటీసీ సభ్యులు కొమ్మూరు రామకోటేశ్వరావు మరియు సర్పంచ్ ఆశా నళిని హాజరయ్యారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు పఠాన్ నాగుల్ మీరా, ఈఓ సరోజ భాయ్, అచ్చారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.