జనసేన ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు

0
637


జనసేన ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
వార్తా లోకం మైలవరం : కొండపల్లి పట్టణంలో హక్కుల సూర్యుడు జై భీమ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల గాంధీ పాల్గొన్నారు. ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. జీవితమంటే బానిస కాదు అని, పోరాడి హక్కులు సాధించుకోవాలని. మనుషులు తల ఎత్తుకొని తిరిగేలా హక్కులు కల్పించిన, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చెరుకుమల్లి సురేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.