బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్… 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిక..

0
88

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 26 ( వార్తాలోకం):
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ లోని 17 మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుతో పాటు ఖందేష్ సంగీత శ్రీనివాస్, వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, మేడిదాల సంగీత రవి గౌడ్, ఇట్టేడి నర్సారెడ్డి, బండారి ప్రసాద్, కొనపత్రి కవిత కాశీరాం, లిక్కి శంకర్, ఇంతియాజ్, ఆకుల రాము, వనం శేఖర్, సుంకరి ఈశ్వరి రంగన్న, ఆయేషా శిరిన్ (ఫయాజ్), పుత్లి బేగం (రహమాన్), నజేవీన్ సుల్తాన్ అతిక్, కొంతం మంజుల మురళి లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ మాజీ చైర్మన్ యాల్ల సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబాగౌడ్, మామిడిపల్లి మాజీ చైర్మన్ జ్యోతి మారుతి రెడ్డి, బాబా ఖాన్, గిరి, కోలా వెంకటేష్, అజ్జు భాయ్, ఫయుమ్, మీర్స్ మాజీద్, సలీం, బాలకిషన్, మీసాల రవి, జిమ్మీ రవి, ఉపేందర్, రాజు భాయ్, శ్రీకాంత్, మురళి, తదితరులు పాల్గొన్నారు.