ఈటెల మౌనం వెనుక మతలబు ఏంటి?

0
339
  • ఈటల మౌనం వెనుక మతలబు ఏంటి
  • పార్టీ కార్యక్రమాలకు దూరం కిషన్ రెడ్డి ప్రోగ్రామ్ కి డుమ్మా
  • రివర్స్ కౌన్సెలింగ్ వ్యాఖ్యలపై దుమారం
  • ఢిల్లీ టూర్.. అసోం సీఎంతో భేటీ
  • హడావుడి తర్వాత ఉన్నట్టుండి గప్ చుప్
  • పెద్దల మందలింపుతోనే మౌనం దాల్చారా?
  • ఈటెల పార్టీ  మారబోతున్నారా?
  • ఢిల్లీలో  అసలు ఏం జరిగింది ?

(వార్తాలోకం ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్)

బీజేపీలో చేరిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల  రాజేందర్ కు ఆ పార్టీలో చేరికల కమిటీ అనే పదవిని క్రియేట్ చేసి దానికి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. కానీ అనుకున్న పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నిస్తు న్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రయత్నిస్తుంటే వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నా రంటూ నిర్వేదపు వ్యాఖ్యలు చేశారు. వీరితో భేటీ తర్వాత ఈటల అనూహ్యంగా అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మతో సమావేశమయ్యారు. తర్వాత మౌన ముద్ర లో ఉన్నారు.

క్రమంలోనే పొంగులేటి. జూపల్లితో భేటీ అయిన ఈటల.. వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చాడంటూ నిర్వేదపు వ్యాఖ్యలు చేశారు. వీరితో భేటీ తర్వాత ఈటెల రాజేందర్ అన్యోన్యంగా అసోం సీఎం హేమంత్ విశ్వశర్మతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మౌనం ముద్ర వేసుకుని కూర్చున్నారు.

బీజేపీ కార్యక్రమాల్లోనూ ఈటెల రాజేందర్ పెద్దగా కనిపించడం లేదు. ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసే ఈటల కొన్ని రోజులుగా నోరెతడం లేదు. దీంతో తెలంగాణ బీజేపీలో ఆయన వ్యవహారం దుమారం రేపుతోంది. కొంతకాలం క్రితం ఢిల్లీ టూర్, అసోం సీఎంతో భేటీ అంటూ హడావుడి చేసిన రాజేందర్ సడెన్ గా సైలెంట్ అయ్యారు. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. బీజేపీ పెద్దలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అప్పటినుంచి ఈటల మౌనంగానే ఉంటున్నారు.

బిజెపి కార్యక్రమాలకు దూరంగా ఈటెల

పార్టీలో గుర్తింపు లేదని తన అనుచరులతో ఈటల అంటుంటారని చాలా రోజులుగా ప్రచారం ఉంది. ఈ క్రమంలో తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం వద్ద ఈటల తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. పార్టీ పెద్దలు మాత్రం బండి వైపే మొగ్గు చూపడంతో ఈటల మౌనం దాల్చారని టాక్. వచ్చే ఎన్నికల్లో బండి నేతృత్వంలోనే పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ క్లారిటీ ఇవ్వడంతో తన ప్రయత్నాలకు ఈటల ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇటీవల కిషన్ రెడ్డి నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్య క్రమానికి కూడా ఈటల డుమ్మా కొట్టడంతో రక రకాల చర్చలు జరుగుతున్నాయి.

బిజెపి సీఎం క్యాండిడేట్ ఈటెల ?
తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గం నుంచి రావడం, కెసిఆర్ ని ఢీ కొట్టి నిలబడడం, గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజలతో సత్సంబంధాలు ఉండడం, ఒక బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకోవడం వంటి కొన్ని కలిసివచ్చే అంశాలు వల్ల ఈసారి బిజెపి సీఎం కాండిడేట్ ఈటెల రాజేందర్ అని భారీ ప్రచారం జరిగింది. ఈటెల వర్గీయులు సోషల్ మీడియాలో ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ప్రచారాన్ని కొంతమంది బిజెపి పెద్దలు తప్పుపట్టారు.

ఈటెల రాజేందర్ పై సీనియర్ల ఆగ్రహం

ఈటల వైఖరిపై తెలంగాణ బీజేపీలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈటలకు బీజేపీ అండగా నిలిచిందని.. ఆయన మాత్రం ఎన్నికల వేళ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కమల దళంలో టాక్ విని పిస్తోంది. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవడం లేదని కొందరు నేతలు అంతర్గతంగా వ్యాఖ్యాని స్తున్నట్టు సమాచారం. మరి ఈటల రాజేందర్ మౌనం వీడి పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు చురుగ్గా పాల్గొంటారో వేచి చూడాలి.