ఎడ్యుకేషన్ ఫెయిర్ విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందిస్తోంది : ప్రిన్సిపాల్ సలోమీ పాల్

0
69

(వార్తాలోకం ప్రతినిధి-హైదరాబాద్, ఫిబ్రవరి 26:
ప్రగతి నగర్ లోని అలీఫ్ గౌతమ్ మోడల్ స్కూల్ లో ప్రగ్యాన్ నాలెడ్జ్ ఎక్స్పో ఏ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పెషలిస్ట్ ఎండోడోంటిస్ట్ డాక్టర్ నేరడి మాధవి  హాజరై ఫెయిర్ ని సందర్శించారు. ఉపాద్యాయులు, విద్యార్థులతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఫెయిర్ గురించి పిల్లలకు ఎలాంటి జ్ఞానం లభిస్తుందో ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సలోమీ పాల్ ప్రసంగించి ఈ ఫెయిర్ గురించి విద్యార్థినులకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విద్యార్థులకు ఎంతో జ్ఞానాన్ని పెంపొందిస్తుందని ఆమె అన్నారు. ఈ ఎక్స్పో నిర్వహించడం ద్వారా మరింత జ్ఞానాన్ని నేర్చుకున్నట్లయిందని టీచర్లు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో GMS డీన్ రాధిక, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
– సురేష్ కట్ట జర్నలిస్ట్