భారత మహిళల హాకీ జట్టు ‘ఫన్ ఫిట్నెస్ చాలెంజ్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ చాలెంజ్ ద్వారా వచ్చిన విరాళాలతో ఢిల్లీలోని ఉదయ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పేదలకు ఆహారం, నిత్యావసర సరుకులు, మెడికల్ (శానిటైజర్, మాస్క్లు) కిట్లు అందించాలనేది తమ ఆలోచన అని కెప్టెన్ రాణీ రాంపాల్ తెలిపింది.