క్రీడాకారులకు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది : కార్పొరేటర్

0
706

వార్తాలోకం హైదరాబాద్ ప్రతినిధి- శ్రీరామ్

అంబర్పేట్ మున్సిపల్ ప్లేగ్రౌండ్( మైదానం)ఇండోర్ స్టేడియంలో లో ఏర్పాటుచేసిన ఎన్ వీర స్వామి గౌడ్ క్యాష్ అవార్డ్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి తో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు , Ex- కార్పొరేటర్ జ్ఞానేశ్వర్ గౌడ్ , వీర స్వామి గౌడ్ , ధనుంజయ గౌడ్, సద్గురు , సత్తిబాబు గౌడ్ , శంబల శ్రీకాంత్ గౌడ్ , అరవింద్ గౌడ్, వెంకటేష్ గౌడ్, యాదగిరి గౌడ్, రజినీకాంత్ గౌడ్ పాల్గొనడం జరిగింది.

ఈ టోర్నమెంట్ ను కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా పద్మా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడా రంగాల్లో చురుగ్గా పాల్గొనాలని భారతదేశానికి అధికంగా పథకాలను సాధించాలని పిలుపునిచ్చారు. క్రీడా రంగానికి క్రీడాకారులకు తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమం లో రోహిత్ నంద రాజు గౌడ్, బాలకృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.