డియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిర్వహించేందుకు శ్రీలంక సుముఖంగా ఉన్నా బీసీసీఐ మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆలోచనలు చే యడం లేదు. కరోనా నేపథ్యంలో భారత్లో ఈ లీగ్ వీలు కాకపోతే తమ దేశంలో జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని గురువారం శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) అధ్యక్షుడు షమ్మి సిల్వ తెలిపాడు. శ్రీలంకలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉండడంతో పాటు భారత్ కన్నా ముందే ఈ వైరస్ తగ్గుముఖం పడుతుందని ఎస్ఎల్సీ అంచనా వేస్తోంది. అయితే, లంక బోర్డు నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని భారత క్రికెట్ బోర్డు తేల్చింది. ‘ప్రపంచమంతా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ బీసీసీఐ ఇప్పుడు ఏ విషయమూ చెప్పే స్థితిలో లేదు. అలాగే లంక నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదన కూడా రాలేదు. అలాంటప్పుడు దాని గురించి చర్చ ఎక్కడిది?’ అని బోర్డు ఉన్నతాధికారి తెలిపాడు.