తెలంగాణ గాయకుడు సాయిచందు ఇకలేరు

0
201

తెలంగాణ మలివిడత ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో ఈ నెల 29 న కన్నుమూశారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సాయిచంద్ నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామస్కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నాగర్ కర్నూల్లోని గాయత్రి. ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తుండగానే గుండెపోటుకు గురయ్యారు. అయితే సాయి చందు కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన భార్య రజనీ కోరడంతో వెంటనే హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు బీఆర్ఎస్ నేత. గుండెపోటుతోనే సాయిచంద్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సాయిచంద్ మృతిపట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ గాయకుడు సాయిచందు ఇకలేరు

బీఆర్ఎస్ పార్టీలో యువనాయకుడిగా ఉన్న సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి తన పాటలతో ప్రజల్లో చైతన్యం, పార్టీ నేతల్లో పోరాట స్ఫూర్తిని కలిగిస్తూ వచ్చిన సాయిచంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తన ఫామ్కి కుటుంబ సభ్యులతో వెళ్లిన సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే | ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే బిజినపల్లి మండలం కారుకొండలోని ఫామాస్లో గుండెపోటుకు గురైన సాయిచంది ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.