మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్యనాదేళ్ల‌

0
769

వాషింగ్ట‌న్ డీసీ : టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా ఉన్న ఆయనకు ఛైర్మన్‌గా సంస్థ అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. బోర్డు ఛైర్మన్‌గా సత్యనాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న జాన్‌ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది.