ఎన్‌సీటీడీ.. డేంజ‌ర‌స్‌ బిల్లు

0
490

న్యూఢిల్లీ: జాతీయ రాజ‌ధాని ఢిల్లీ ప్రాదేశిక ప్రాంతం స‌వ‌ర‌ణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే బిల్లు ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. బిల్లును పాస్ చేయ‌వ‌ద్దు అంటూ కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే అన్నారు. ఇది డేంజ‌ర‌స్ బిల్లు అని ఆయ‌న విమ‌ర్శించారు. ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధుల అధికారాల‌ను ఆ బిల్లుతో కాజేస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ప్ర‌భుత్వ అధికారాల‌న్నీ గ‌వ‌ర్న‌ర్ వ‌ద్దే ఉంటాయ‌ని, ఎన్నికైన వారంతా నౌక‌రీలుగా మారుతార‌ని ఖ‌ర్గే తెలిపారు. మంత్రి కిష‌న్ రెడ్డి బిల్లును ప్ర‌వేశ‌పెడుతూ ప్ర‌క‌ట‌న చేయ‌గానే.. విప‌క్ష స‌భ్యులు గంద‌ర‌గోళం సృష్టించారు. దీంతో డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ స‌భ‌ను వాయిదా వేశారు. ఆ త‌ర్వాత మ‌రోసారి కూడా స‌భ‌ను వాయిదా వేశారు.