ఆర్ జి కే కాలనీలో టీఆర్ఎస్ సంబరాలు

0
326

ఆర్ జి కే కాలనీలో టీఆర్ఎస్ సంబరాల

వారాలోకం, ప్రతినిది, ఘట్కేసర్,8నవంబర్:

మునుగోడు నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ గెలుపుతో

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఆర్ జి కే కాలనీలో సంబరాలు జరుపుకున్నారు పోచారం మున్సిపల్ కౌన్సిలర్లు.

టిఆర్ఎస్ పార్టీ గెలుపును ఉద్దేశించి పోచారం మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ అధికార దాహంతో సొంత లాభం కొరకై బీజేపీ పార్టీలో చేరి నియోజకవర్గ అభివృద్ధి కొరకై రాజీనామా చేశానని ఎన్ని కళ్లి బొల్లి మాటలు చెప్పిన మునుగోడు ప్రజలు తగిన రీతిలో రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను మునుగోడు ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించి మునుగోడు నియోజకవర్గం ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీ వైపే నిలబడ్డారని తెలిపారు ఆరో వార్డు కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి. ఈ గెలుపుకు సహకరించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీకి తిరుగే లేదని మునుగోడు గెలుపే నిదర్శనమన్నారు

సాయిరెడ్డి. రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుందని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ జీకే కాలనీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శివ చౌదరి, ఎండి మధు, ప్రసాద్, యాది, దుర్గ జలంధర్ అనిల్ సోను, శ్రావణ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రణీత్ శివ తదితరులు పాల్గొన్నారు.