సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి లో వైభవంగా అయ్యప్ప మండలం పూజ

0
270

వార్తాలోకం ప్రతినిధి-హైదరాబాద్, డిసెంబర్ 26:
సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి పరిధిలోని రాయల్‌ ఎంక్లేవ్‌లో శబరిమల అయ్యప్ప తీర్థక్షేత్రం ఆధ్వర్యంలో ఘనంగా హరిహర పుత్ర అయ్యప్పస్వామి మండలపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు, కపిల్‌ బార్‌బారీ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని గజారోహణం చేయించి అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఊరేగించారు, స్థానిక మహిళలు మంగళహారతులతో ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలికి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో తీర్థక్షేత్ర కమిటీ సభ్యులతో పాటు అయ్యప్ప సేవా సంఘం నేతలు బుచ్చిరెడ్డి, తాటిపాల నవీన్‌, నిఖిల్‌, దినకర్‌, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శబరిగిరీషుడిని కీర్తిస్తూ, సాగిన భజనలు అందరిని ఆకట్టుకున్నాయి.