రైతు భరోసా యాత్రకు 5 లక్షల సాయం

0
449

వార్తాలోకం ప్రతినిధి చిలకలూరిపేట సెప్టెంబర్ 19
యడ్లపాడు మండలంలోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కీ.శే గోనుగుంట్ల తిరుపతయ్య గారి కుమారుడు మరియు కోడలు గోనుగుంట్ల క్రాంతి కుమార్, కృష్ణవేణి గార్లు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై గుంటూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులైన LB నాయుడు గారి ఆధ్వర్యంలో నేడు మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి రైతుభరోసా యాత్రకు తమవంతు సాయంగా 5 లక్షల రూపాయలను అందజేశారు. త్వరలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి జనసేన పార్టీలో చేరనున్నారు వీరి చేరికతో యడ్లపాడు మండల రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి.