కార్మికుల హక్కుల కోసం  రాజీలేని పోరాటం!

0
1191

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుJ జూన్ 1 తేదీన మంగళవారం వార్త లోకం ప్రతినిధి ఎండిఓ ఆఫీస్ ఆవరణలో  సి ఐ టి యు 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని, మంగళవారం  సి ఐ టి యు మండల కన్వీనర్, దాసరి.జయచంద్ర, అధ్యక్షతన సీనియర్ కార్మిక నాయకులు మోడీ సుబ్బరామయ్య జెండా ఆవిష్కరించారు.  ముఖ్యఅతిథిగా పాల్గొన్న, సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, 1920 లో ఏర్పడిన  ఏఐటీయూసీ  ఉమ్మడి నాయకత్వం ఉన్నప్పుడు కార్మికుల ఐక్యత పరిచి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది. కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న కార్మిక సంఘాలు స్వాతంత్రం వచ్చే ముందర, కాంగ్రెస్ పార్టీ,  సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వాన కార్మిక వర్గాన్ని  చీల్చి , పెట్టుబడిదారులకు అనుకూలం గా ఐ ఎన్ టి యు సి, కార్మిక  సంఘం ఏర్పాటు  చేశారన్నారు. 1958లో మతం పేరుతో బీజేపీ అనుబంధ బి ఎం ఎస్  కార్మిక సంఘంగా   సిల్చార్ అన్నారు. ఏఐటీయూసీ వర్గ సామరస్యానికి, వ్యతిరేకం, పాలకవర్గాలకు  తోక గాను, లొంగుబాటు  ధోరణులకు వ్యతిరేకంగా, 1970, మే 30, 31, జూన్ ఒకటో తేదీన, కలకత్తా మహాసభల్లో, సి ఐ టి యు ఏర్పడిందన్నారు. ఐక్యత, పోరాటం, నినాదం తో, కార్మికులను  ఐక్య పరిచి   కార్మికవర్గపోరాటం తో, దోపిడీకి వ్యతిరేకంగా, పెట్టుబడిదారి సమాజానికి వ్యతిరేకంగా, కార్మిక రాజ్యం,  సోషలిజం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. సి ఐ టి యు మొదటి జాతీయ అధ్యక్షుడిగా, రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శిగా బీటీ రణదివే గారిని  ఎన్నుకున్నారు. సి ఐ టి యు ఏర్పడినాక, అనేక జాతీయ సమ్మెలు జరిగాయి , రైల్వే సమ్మె చరిత్రాత్మక మన్నారు.
భారతదేశంలో జాతీయోద్యమం, కార్మికోద్యమం పెనవేసుకొనే సాగాయి.ఏఐటియుసి ఏర్పడ్డ ప్రారంభ దినాల్లో జాతీయోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులే ఆ తరువాత ఏఐటియుసికి నాయకత్వం,వహించారు.బి.టి.రణదివే,పి.రామ్మూర్తి, డాంగే,ఘాటే వంటి ఎందరో కమ్యూనిస్టు నాయకులు కూడా కీలక పాత్ర పోషించారు.నాటి పాలకవర్గం బోనస్‌ను 8.33 నుండి 4శాతానికి తగ్గిస్తే ఏఐటియుసి అధినేత ఎస్‌.ఎ. డాంగే దాన్ని అంగీకరిస్తూ సంతకం చేశాడు.ప్రభుత్వమే ఏకపక్షంగా వేతనం నిర్ణయించేలా వేజ్‌ కోడ్‌కు ప్రభుత్వం ప్రతిపాదిస్తే అంగీకరించాడు.1975 నుండి 1977 వరకు ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీని సపోర్ట్‌ చేశారు.ఏఐటియుసి సంస్కరణవాద ధోరణులను వ్యతిరేకించిన నాయకులను యూనియన్ల నాయకత్వ బాధ్యతల నుండి తొలగించి, వారు బాధ్యత వహిస్తున్న సంఘాల,అనుబంధాలనురద్దుచేశారు.భారతదేశంలో వర్గ దోపిడీని అంతం చేసి సాంఘిక మార్పుకు వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలనే లక్ష్యసాధన కోసం సిఐటియు ఏర్పడింది.సిఐటియు తన లక్ష్యాన్ని,నిబంధనావళిలోస్పష్టంగారాసుకుంది.ఉత్పత్తి సాధనాలన్నీ,పంపిణీని సమాజపరం చేస్తే తప్ప కార్మికుల దోపిడీ అంతం కాదని చెప్పింది.ఈ మార్పు వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమని,అన్నిరకాల అణచివేతలు,వివక్షలను ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చింది.అన్నిరకాల వర్గ సామరస్యాలను వ్యతిరేకిస్తామని కూడా తమ లక్ష్యాలలో నిర్థేశించుకున్నది. 1970లో ”ఐక్యత-పోరాటం” నినాదంతో సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) ఆవిర్భవించింది.సిఐటియు ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే పాలకవర్గాలు, ఇతర కార్మిక సంఘాలు సిఐటియుని ఒంటరి చేసే ప్రయత్నాలు చేశారు. సిఐటియు పిలుపునిచ్చిన ఐక్యతా నినాదాన్ని అవహేళన చేశారు.సిఐటియు మాత్రం తన కార్యాచరణ ద్వారానే సమాధానం ఇచ్చింది.
ఇందిరాగాంధీ చేపట్టిన వేతన,స్తంభన, కంపల్సరీ డిపాజిట్‌ స్కీంలకు వ్యతిరేకంగా పోరాడటానికి సిఐటియు చొరవ చేసి యునైటెడ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్లను ఏర్పాటుచేసింది.ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి ప్రభుత్వం సిఐటియు సంస్థను అణచివేయ జూసింది. సిఐటియు నాయకత్వం,తీవ్రనిర్భంధాలకు,గురైంది.అయినాపౌరహక్కులు,అప్రజాస్వామ్య అణచివేతలను నిరసిస్తూ కార్మికవర్గ ఐక్యతను చాటి చెబుతూ కార్మిక,ప్రజా పోరాటాలకు సిఐటియు మద్దతు కూడగట్టింది. రైతులు, వ్యవసాయ కూలీల వ్యవసాయ కూలీల సమస్యల్ని ముందుకు తెచ్చి 1982 జనవరి 19న మొదటిసారిగా దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది.ఇందులో కార్మికవర్గం,రైతులు, వ్యవసాయ కార్మికుల డిమాండ్లను కూడా దేశ కార్మికోద్యమం లేవనెత్తింది. ఈ సమ్మెలో పాల్గొన్న 10మంది వ్యవసాయ కార్మికులు పోలీస్‌ కాల్పుల్లో చనిపోయారు. సిఐటియు జనవరి 19న ఆనాటి నుండి కార్మిక-కర్షక సంఘీభావ దినంగా పాటిస్తుంది.1995 నవంబర్‌ 17న నాటి కార్మిక శాఖామంత్రి వెంకటస్వామి ఇ.పి.ఎస్‌. పథకాన్ని ప్రకటించాడు. ఏఐటియుసితో సహా మొత్తం కార్మిక సంఘాలు ఆ పథకాన్ని రెండు చేతులా ఆహ్వానించాయి.ఒక్క సిఐటియు మాత్రమే దాన్ని వ్యతిరేకించింది.దేశవ్యాప్త క్యాంపెయున్‌ను నిర్వహించింది.1996 ఫిబ్రవరి 26 అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చింది.ఆనాటి సిఐటియు సభ్యత్వంతో నిమిత్తం లేకుండా ఎన్నో రెట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.సిఐటియు చేస్తున్న స్వతంత్ర కార్యాచరణ ద్వారా ఐక్య కార్యాచరణకు ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుంది.2018లో నిర్వహించిన మహాపడావ్‌ అందుకు ఉదాహరణ.2019 జనవరి 8, 9 తేదీల్లో జరిగిన రెండు రోజుల సమ్మెలో 20 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. వివిధ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో వివిధ సెక్టార్లలో కోల్‌,స్టీల్‌, ప్లాంటేషన్‌,అంగన్‌వాడీ,ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికుల్లో ఐక్య ఉద్యమాలు – సమ్మెలు జరిగాయి.
సిఐటియు కేవలం కార్మిక సంఘాల,కార్మికుల మధ్య ఐక్యత సాధించడానికే పరిమితం కాలేదు.సమాజంలో దోపిడీకి,అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాల కార్మిక,ప్రజానీక సమస్యలపై తన గొంతెత్తి నినదించింది. 2020 నవంబర్‌ 26న 20వ సార్వత్రిక సమ్మె సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమాన్ని తన అక్కున చేర్చుకొని విజయం సాధించే వరకు ఆ పోరాటంతో మమేకమైంది.గ్రామీణ వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఉమ్మడి పోరాటాలతో సిఐటియు,మమేకమవుతుంది. శ్రామికమహిళలను ఉద్యమాలలోకి తీసుకు రావడంలో సిఐటియు పాత్ర చాలా ముఖ్యమైనది. దీనిని ఒక వర్గ కర్తవ్యంగా సిఐటియు గుర్తించింది.వర్గ ఐక్యతను పెంపొందించడానికి, అలాగే వర్గ పోరాటాలను బలోపేతం చేయడానికి శ్రామిక మహిళలు ఉద్యమంలోకి రావడం ముఖ్యమైనదిగా సిఐటియు,భావించింది.1979లోమొట్టమొదటిసారిగా శ్రామిక మహిళా జాతీయ సదస్సును సిఐటియు నిర్వహించింది.మతోన్మాద ఎజెండాతో అధికారంలోకి వచ్చిన బిజెపి మనుస్మృతి ఆధారంగా మెజారిటీ రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తున్నది. అందులో భాగంలో దళితులు, ఆదివాసులు,మహిళలపై అణచివేత,దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నది. గో సంరక్షణ సాకుతో ముస్లీం మైనారిటీలు,దళితులపై దాడులు చేస్తున్నది.కులాంతర వివాహాల జంటలను ఎంచుకొని వేధింపులకుపాల్పడుతున్నది.తద్వారా కార్మికవర్గ,ఐక్యతకువిఘాతంకలిగిస్తున్నది.కార్మికవర్గ ఉద్యమం ఆర్ధిక డిమాండ్ల పోరాటంలో విజయం సాధించాలంటే నయా ఉదారవాద విధానాలపై పోరాడాలి.సామ్రాజ్యవాద కుట్రలను ఓడించాలి. రాజకీయంగా,సైద్ధాంతికంగా అన్ని స్థాయిల్లో కార్మికవర్గ ఐక్యతకు కృషి చేయాలి. కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసే మతతత్త్వ శక్తులను,వేరుచేసిఓడించాలి,అనిపిలుపునిచ్చారు.అన్నిరకాల దోపిడీ, అణచివేతలను అంతం చేయాలనే లక్ష్యంతో కార్మికవర్గం శ్రమ జీవులందరినీ ఏకం చేయాలనే లక్ష్యం కోసం సిఐటియు పని చేస్తున్నది.నయా ఉదారవాద విధానాలను,దుందుడుకుగాఅమలుపరుస్తూ,కార్పొరేట్‌ సంస్థలను ప్రయోజనాలు, లాభాల కోసం దేశాన్ని దివాళా తీయిస్తున్నది.నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం,లీజుకు ఇవ్వడం, ప్రయివేటీకరించడంతో మన దేశ సంపదను లూఠీ చేస్తున్నది.భారతదేశాన్ని రక్షించుకుందాం! ప్రజల్ని కాపాడుకుందాం!!” అనే నినాదంతో దేశ రక్షణ కోసం కార్మికవర్గాన్ని జాగృతం చేస్తున్నది.భారత కార్మికోద్యమ చరిత్రలో సిఐటియు నిర్వహించిన పాత్ర అమోఘమైనది అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు మండల నాయకులు లింగాల, యానాదయ్య,  సిగి చెన్నయ్య,సి.పుల్లయ్య,  నారదాసు,సుబ్బరాయుడు, మావిళ్ళ శేఖర్, శ్రీలక్ష్మి, రమాదేవి, సుజాత,  రాధాకుమారి, పద్మ, పులగం టి శ్రీనివాసులు, సుదర్శన్, సురేంద్ర, వర్మ రాజు, పంది  కాళ్ళ మణి,  ఓబిలి పెంచలయ్య, రామాంజనేయులు, సి వేణు, హేమంత్, మద్దెల ప్రసాదు, జాన్ ప్రసాద్ బొజ్జ శివయ్య,  రజక,సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.