వికలాంగుల కాలనీ లో ఉపాధ్యాయుల దినోత్సవం

0
570

ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ వికలాంగుల కాలనీ లో ఉపాధ్యాయుల దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు మొక్క ఉపేందర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల లింగమల్లు, సీనియర్ జర్నలిస్టు షేక్ కమల్ వలి, జనరల్ సెక్రటరీ భూతం లింగ యాదవ్ కోఆర్డినేటర్ ఉప్పల బాల్ నరసింహ నాయకురాలు మైస మైసమ్మ ఐలమ్మ త్రివేణి కాలనీ ప్రజలు పాల్గొని ప్రపంచంలో ప్రతి జీవికి విజ్ఞానం అవసరం ఆ జ్ఞానం గురువు ద్వారానే లభిస్తుందని, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః అన్నారని త్రిమూర్తులతో పాటు గురువుగారు నిలబడితే మొదటగా ఎవరికి నమస్కరిస్తారు అంటే గురువు గారికి నమస్కరిస్తామంటారు. కావున గురువుకి మొదటి స్థానం ఇచ్చారు. కావున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి, భారత రాష్ట్రపతిగా మరియు ఉపరాష్ట్రపతి గా దేశ సేవ చేసి భారతరత్న అయ్యారని తన పుట్టిన రోజు ఉపాధ్యాయ దినోత్సవం చేయాలని కోరుకోవడం లోనే తన గురుభక్తి ఎంతో తెలుస్తుందని అతని సేవలు మరువ రానివ్వని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నివాళులు అర్పించారు.