కేంద్ర‌మంత్రిని క‌లిసిన అంబ‌ర్‌పేట ఫోటోగ్రాఫ‌ర్ అసోసియేష‌న్ స‌భ్యులు

0
714

(వార్తాలోకం ప్ర‌తినిధి-హైద‌రాబాద్ (సామేశ్‌)

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డిని అంబర్పేట్ ఫోటో & వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ స‌భ్యులు ఢిల్లీలోని ఆయ‌న అధికారిక‌ నివాసంలో క‌లిశారు. అంబర్ పేట్ అసోసియేషన్ కొరకు మరియు సభ్యులకు ESI కార్డుల జారీ చేయాల‌ని కోరారు. దీనిపై కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. పోటో,వీడియో గ్రాఫ‌ర్ల కోసం త‌న సాయం చేస్తామ‌ని హామీఇచ్చారు. అంతేకాకుండా నూత‌నంగా ఎన్నికైన పోటోగ్రాఫ‌ర్ అసోసియేష‌న్ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు కేంద్ర‌మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. కేంద్ర‌మంత్రిని క‌లిసిన వారిలో పోటోగ్రాప‌ర్స్‌, ఎం. శ్రీ‌రాములు, ఏ.ర‌వి త‌దిత‌రులు వున్నారు.