సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు 60 రోజుల మాస్టర్ ప్లాన్

0
520

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నాడు. ఒక వైపు సినిమాలు మరో వైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు మహేష్ బాబు. కరోనా వైరస్ వచ్చి షూటింగ్స్ అన్నీ ఆగిపోయిన సమయంలో కూడా ఈయన యాడ్స్ చేశాడు. ఇప్పుడు కూడా ఒకవైపు సర్కారు వారి పాట సినిమా చేస్తూనే మరోవైపు ఎండోర్స్ మెంట్ తో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక యాడ్ చేశాడు మహేష్. ఇంత బిజీగా ఉన్న ఈయన తాజాగా ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. అది గాని వర్కౌట్ అయిందంటే అభిమానులకు అంతకు మించిన సర్‌ప్రైజ్ మరొకటి ఉండదు.
సర్కారు వారి పాట సినిమా తర్వాత రాజమౌళితో ఒక ప్రాజెక్టు అనుకుంటున్నాడు మహేష్ బాబు. చాలా సంవత్సరాలుగా ఇది పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు రాజమౌళి కూడా మహేష్ బాబు సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దీనికోసం ఇప్పటికే విజయేంద్రప్రసాద్ కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండేళ్లు ఆయనకు ఇవ్వాల్సిందే. అందుకే ఈ లోపు మహేష్ మరో సినిమా చేయాలనుకుంటున్నాడు. రాజమౌళి సినిమాకు ముందు.. సర్కారు వారి పాట తర్వాత మరో సినిమా పూర్తి చేసి అభిమానులకు సర్ ప్రైజ్ అనుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే ఈ మధ్య ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఆయనను బౌండెడ్ స్క్రిప్ట్ ను సిద్దం చేయాలని కోరాడు మహేష్ బాబు. సాధారణంగా కొత్త దర్శకుల వైపు అంత ఈజీగా అడుగులు వేయని సూపర్ స్టార్.. తనకు ఎంతో కాలంగా తెలిసిన ఒక నూతన దర్శకుడు చెప్పిన లైన్ కు ఫిదా అయిపోయాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. 2022లో రెండు సినిమాలతో రావడానికి ప్రయత్నిస్తున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత ప్రశాంతంగా రాజమౌళి సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నాడు. వినడానికి ఈ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. వర్కౌట్ అయితే అంతకంటే అద్భుతంగా ఉంటుంది.