తాత జయంతికి గైర్హాజరు..కిమ్ ఏమయ్యాడు?

0
722

అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ అమెరికాతో పాటు ప్రపంచాన్ని వణికించే వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రస్తుతం అతడు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అతడు సైలెంట్ గా ఉన్నాడు. అయితే తమ దేశంలో ఇంకా కరోనా వైరస్ అడుగుపెట్టలేదని ఆ దేశం చెబుతుండగా అవన్నీ అవాస్తవాలేనని – నిజాలు కప్పి పుచ్చుతున్నారని అంతర్జాతీయ సమాజం చెబుతోంది. అయితే అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం కిమ్ ఆ దేశంలో కనిపించడం లేదని హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తన తాత జయంతి వేడుకలకు గైర్హాజరయ్యాడు. దీంతో ఆ దేశంతో పాటు ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.