అహ్మదాబాద్: అరంగేట్రం మ్యాచ్లోనే యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56పరుగులు) ఆకట్టుకున్నాడు. అదిల్ రషీద్ వేసిన పదో ఓవర్లో రెండు సిక్సులు బాది తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. అదే దూకుడు ప్రదర్శిస్తున్న సమయంలో ఆదిల్ రషీద్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో 94 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.