రెండో స్థానానికి భారత్‌

0
1274

దుబాయ్‌: విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఐసీసీ టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే టెస్టుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న భారత్‌ వన్డేల్లోనూ రెండో ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్‌ 3-2తో కైవసం చేసుకోవడంతో అరోన్‌ ఫించ్‌ కెప్టెన్సీలోని ఆసీస్‌ మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య కేవలం ఏడు పాయింట్ల వ్యత్యాసం ఉంది. త్వరలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్‌ తలపడనుంది.