శ్రీ కాళహస్తి లో కొవిడ్ టెస్టులు ప్రారంభం

0
666

శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో ట్రూ నాట్ యంత్రాల ద్వారా కొవిద్ టెస్ట్ ల ను ప్రారంభించారు. త్వరితగతిన కోవీడ్ పరీక్షలు చేసేలా ఏరియా హాస్పిటల్ లోనూ టెస్టింగ్ ల్యాబ్ ల ను ఏర్పాటు చేశారు.

కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించడానికి జిల్లాలోని ఏరియా హాస్పిటల్ ల లో కోవీ డ్ టెస్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో శనివారం నుంచి ట్రూ నాట్ మిషన్ ద్వారా పరీక్షలు చేపట్టారు. రోజుకు 20 నుంచి 40 పరీక్షలను చేసి ఫలితాలను అక్కడికక్కడే వెల్లడించనున్నారు.

శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఒక మిషన్ ద్వారా రోజుకు ఇరవై నుంచి నలభై మంది కి సంబంధించిన శాంపిల్స్ ను పరీక్షా చేయనున్నామని తెలిపారు. తదుపరి మిషన్ల సంఖ్య పెంచి రోజుకు వంద వరకు పరీక్షలు చేయనున్నట్టు వివరించారు.