9వ వార్డులో సమస్యలపై సమర శంఖం పూరించిన కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి

0
394

 

వార్తాలోకం, ప్రతినిధి, ఘట్కేసర్, డిసెంబర్ 09: అందరూ మెచ్చిన నాయకుడు, ప్రజలకోసం.. ప్రజా సేవ కోసం అహర్నిశలు కష్టపడే లీడర్. ఎవరికి ఏ కష్టం వచ్చినా అర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా క్షణాల్లో వారి కన్నీళ్లను తుడిచే మహోన్నత వ్యక్తి. ఆయన ఎవరో కాదు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం రాజీవ్ గృహకల్ప 9వ వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి. ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే జీవిస్తారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే 9వ వార్డులో నెలకొన్న సమస్యలపై సమర శంఖం పూరించారు. 9వ వార్డులోని బ్లాకులలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తానని మెట్టు బాల్ రెడ్డి తెలిపారు. పోచారంలోనే కాదు తెలంగాణ లో బెస్ట్ వార్డుగా నిలిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. 9వ వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంటనే వస్తానని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశానని తెలిపారు. బైక్ లలో పెట్రోల్ దొంగతనాలు జరగకుండా 9వ వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. మెజార్టీ బ్లాక్ లలో కరెంట్ కొత్త మీటర్లు బిగించామని.. మిగిలిపోయిన బ్లాక్ లలో కూడా త్వరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి తెలిపారు.