సీఎంకు రాఖీ కట్టిన రజనీ
ఈ ఏడాది రాని షర్మిల!
అమరావతి:పలువురు రాష్ట్ర మహిళ మంత్రులు సీఎం జగన్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర మంత్రులు వనిత,విడదల రజనీ జగన్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు వీరితో పాటు మహిళా కమీషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ తదితరులు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్ జగన్కు రాఖీలు కట్టిన ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస తదితరులు సీఎంను కలిశారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సెప్టెంబర్లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్కు ముఖ్యమంత్రిని ఆహ్వనించారు.