సౌతిండియా పొలిటికల్ జేఏసీ ఛైర్మన్, ఉస్మానియా యూనివర్శిటీ లా కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. డాక్టర్ గాలి వినోద్ ని, సౌతిండియా అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ నాగేందర్ ఆధ్వర్యాన ఆయన ఛాంబర్లో పుష్ప గుచ్చం ఇచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం గురించి, ఇదే అంశంపై ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సౌతిండియా అడ్వకేట్ జేఏసీ సభ్యులు, అడ్వకేట్స్ పాల్గొన్నారు.